1953 లో వినోదా వారి సంస్థ నిర్మించిన దేవదాసు చిత్రం నుండి ఘంటసాల పాడిన పల్లెకుపోదాం పారును చూదాం. గీత రచన: సముద్రాల సీనియర్, సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్. దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య. తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,పేకేటి, లలిత.
అష్టవసువులు ఒకసారి వారిలో ద్యు అనే వాడి ప్రోద్బలంతో వశిష్ట ముని ఆశ్రమములోని కామధేనువును అపహరిస్తారు. ఆ ముని ఉగ్రుడై ఆ ఎనమండుగురిని భూలోకంలో జన్మించమని శపిస్తాడు.ద్యు తప్ప మిగిలిన వారు ముని కాళ్ళపై పడి క్షమాపణకోరి శాపం ఉపసంహరించమని ప్రార్థిస్తారు. అయితే సహాయంచేసిన ఏడుగురు వసువులు భూమిపై స్వల్పకాలం జీవిస్తారని, ఎనిమిదవ వసువు మాత్రం చిరకాలం భూమిపై జీవిస్తాడని మహర్షి చెబుతాడు. అదే సమయంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సృష్టించిన గంగను నిండుసభలో మహాభిషుడనే రాజు చూస్తాడు. పరస్పరం మోహంలో పడి సభామర్యాదను మరచిపోతారు. అందుకు బ్రహ్మ కోపంతో వారిద్దరినీ భూలోకంలో జన్మించమని శాపం ఇస్తాడు. గంగ భూలోకం వస్తుండగా అష్టవసువులు ఎదురై వారికి శాపవిమోచనం కలిగించమని గంగను వేడుకుంటారు. మహాభిషుడు శంతనుడిగా పుట్టి గంగను వివాహం చేసుకుంటాడు. అయితే తను చేసే ఏ పనికైనా అభ్యంతరం చెబితే శంతనుని విడిచి వెళ్ళిపోతానని గంగ శంతనుతో వాగ్దానం చేయిస్తుంది. వారికి పుట్టిన ఏడుగురు మగపిల్లలను గంగ నదిలో ముంచి చంపి వారికి శాపవిముక్తి కలిగిస్తుంది. అయితే ఎనిమిదవ పుత్రుడ్ని కూడ నదిలో పడవేయబోతుండగా శంతనుడు అడ్డు పడతాడు. అపుడు గంగ శంతనుని విడిచి పుత్రునితో వెళ్ళిపోతుంది. అతనిని పెంచి విద్యలు నేర్పి శంతనుని వద్దకు చేరుస్తుంది. అతడే గాంగేయుడు. తన తండ్రి శంతనుడు దాసరాజు కూతురు మత్స్యగంధిని పెళ్ళిచేసుకోవడానికి అనుకూలంగా తాను ఆజన్మ బ్రహ్మచారిగా వుంటానని భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయాడు.
తెలుగువారి అదృష్టఫలము వేమన కవి. ఇతని అసలు పేరు వేమారెడ్డి. వేమన జీవిత చరిత్రను 1947 లో "యోగి వేమన" పేరుతో ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థ వాహినీ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఒక నృత్య సన్నివేశానికి ఘంటసాల, యం.వి. రాజమ్మ "ఆపరాని తాపమాయెరా" అనే పాటను పాడారు. యం.వి.రాజమ్మ అలనాటి ప్రముఖ కన్నడ నటి. ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించారు.
కృతజ్ఞతలు: పోస్టరునందించిన బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి, సమాచారంఉ పొందుపరచిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము వారికి, శ్రవణ ఖండికను పొందుపరచిన ప్రాజెక్టు ఘంటసాలకు, దృశ్యఖండికను అందించిన .... వారికి హృదయపూర్వక ధన్యవాదములు.
పి.ఎస్.ఆర్. పిక్చర్సు పతాకం పై 1971 లో నిర్మించిన చిత్రం పవిత్ర హృదయాలు. ఇందులో ఎన్.టి.ఆర్., జమున నటించారు. ఈ చిత్రానికి సంగీతపరమైన ఒక పాటను పటదీప్ రాగం లో దర్శకులు టి.చలపతి రావు బాణీ కట్టారు.
చిత్రం: పవిత్ర హృదయాలు (1971) గీత రచన: డా.సి.నారాయణ రెడ్డి స్వర కర్త: టి.చలపతి రావు గానం: ఘంటసాల వేంకటేశ్వర రావు
రిపబ్లిక్ సంస్థ 1967 లో నిర్మించిన "రక్త సిందూరం" చిత్రం నుండి ఘంటసాల, పి.సుశీల పాడిన పాట. గీత రచన మహాకవి శ్రీ శ్రీ. సంగీతం సాలూరు రాజేశ్వర రావు. ఇందులో శోభన్ బాబు, రాజశ్రీ, రామకృష్ణ, గీతాంజలి, విజయలలిత ముఖ్య తారాగణం. దర్శకత్వం సీతారాం.
ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com