1948 సంవత్సరంలో విడుదలైన భరణీ సంస్థ నిర్మించిన రత్నమాల చిత్రం నుండి ఘంటసాలబృందం తో పాడిన "ఓరందగాడ ఓబులేశ" అనే ఈ బృందగీతం రచన సముద్రాల సీ. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్. అయితే ఈ పాటను స్వరపరచినది ఘంటసాల మాస్టారు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, డా.గోవిందరాజుల సుబ్బారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు,హేమలత, అరణి. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు పి. రామకృష్ణ. ఈ పాటను దొంగలముఠా నటులు పై చిత్రీకరించారు. ఈ చిత్రం 02.01.1948 న విడుదలైంది.
కృతజ్ఞతలుః ఈ చిత్రంలో పాటల సాహిత్యం మరియు వివరాలను శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు సంకలనం చేసిన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" పుస్తకం నుండి సేకరించబడింది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి