1952 సంవత్సరంలో విడుదలైన యువా సంస్థ నిర్మించిన టింగ్ రంగా చిత్రం నుండి ఘంటసాలఘంటసాల పాడిన "కవి కలముకు శిల్పి ఉలికి" అనే ఈ ఏకగళగీతం రచన తాపీ ధర్మారావు, స్వరపరచినది టి.వి.రాజు,ఎస్.బి.దినకరరావు. ఈ చిత్రంలో తారాగణం శ్రీరామ మూర్తి, ఎస్.వరలక్ష్మి, కనకం, నల్ల రామమూర్తి, సీతారాం, పి.సూరిబాబు . ఈ చిత్రానికి నిర్మాత పి.ఎస్.శేషాచలం మరియు దర్శకుడు బి.ఏ.సుబ్బారావు. దీనిని శ్రీరామమూర్తి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 06.06.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి