1951 సంవత్సరంలో విడుదలైన విజయా సంస్థ నిర్మించిన పాతాళ భైరవి చిత్రం నుండి ఘంటసాల పి.లీల తో పాడిన "ఎంత ఘాటు ప్రేమయో" అనే ఈ యుగళగీతం రచన పింగళి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, మాలతి, ఎస్.వి.రంగారావు, రేలంగి, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత నాగిరెడ్డి-చక్రపాణి మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని ఎన్.టి.ఆర్., మాలతి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 15.03.1951 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి