1959 సంవత్సరంలో విడుదలైన శ్రీ సారథీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భాగ్యదేవత చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన "మదిని హాయి నిండెగా " అనే ఈ యుగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం. ఈ చిత్రానికి నిర్మాత సారథీ స్టూడియోస్ మరియు దర్శకుడు తాపీ చాణక్య. దీనిని జగ్గయ్య, సావిత్రి లపై చిత్రీకరించారు. ఈ చిత్రం 23.10.1959 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి