1965 సంవత్సరంలో విడుదలైన రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన వీరాభిమన్యు చిత్రం నుండి ఘంటసాల పాడిన "పాలకడలివంటి " అనే ఈ పద్యం రచన సముద్రాల సీ., స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, శోభన్బాబు, కాంచన, ఎస్.వరలక్ష్మి, జి.వరలక్ష్మి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్లాల్ నహతా, డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #000 | పద్యం: | పాలకడలి వంటి |
|---|---|---|
| నిర్మాణం: | రాజ్యలక్ష్మీ ప్రొడక్షంస్ | |
| చిత్రం: | వీరాభిమన్యు (1965) | |
| రచన: | సముద్రాల సీనియర్ | |
| సంగీతం: | కె.వి.మహదేవన్ | |
| గానం: | ఘంటసాల | |
| పాలకడలి వంటి పాండవాగ్రజు మదిన్ | ||
| కోపాగ్ని రగిలి భగ్గుమనునాడు | ||
| గంధ గజేంద్రమ్ము కరణి భీముడు నిన్ను | ||
| నీ సహోదరుల మ్రందించునాడు | ||
| పరమేశునోర్చిన పార్థుడు గాండీవ | ||
| మంది కర్ణుని దునుమాడునాడు | ||
| మాయారణ విదుండు మా ఘటోత్కచుడు నీ | ||
| బలగమ్ము గంగలో కలుపునాడు | ||
| గీ॥ | ఎదిరి గెలువంగ నేర్తువే ఇందరేల | |
| అభినవ త్రినేత్రమూర్తి వీరాభిమన్యు | ||
| డొక్కడే చాలు సంగరమోర్చి గెలువ | ||
| ఈ మహావీరులందెవ్వరేని అడ్డు | ||
| రారు, నిను కావగాలేరు రాజ రాజ! |


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి