విజయ గోపాల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మింపబడిన పౌరాణిక చిత్రం గంగా గౌరీ సంవాదం. ఇందులో సి.హెచ్.నారాయణ రావు, కాంతారావు, కృష్ణకుమారి, జానకి ప్రముఖ తారాగణం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు ఒక పద్యం, ఒక పాట గానం చేసారు. ఎం.ఎస్. రామారావు, రఘునాథ్ పాణిగ్రాహి, జిక్కీ, పి.లీల కూడ కొన్ని పాటలు పాడారు. అరుదైన ఈ ఆణిముత్యాన్ని పొందుపరచిన ఘంటసాల గాన చరిత కు, చిత్రం యొక్క వివరాలు పది కాలాలు నిలిచేలా సమకూర్చిన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి, వికిపీడియా బ్లాగులకు హృదయపూర్వక ధన్యవాదములు.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
| చిత్రం: గంగా గౌరీ సంవాదము (1958) | ||
| రచన: పరశురామ్ | ||
| సంగీతం: పెండ్యాల | ||
| గానం: ఘంటసాల | ||
| సీ. | ఇంద్రాది దేవతల్ వంది మాగధులట్లు | |
| స్తోత్ర పాఠంబుల సొంపు నింప | ||
| విష్ణు విధాతలు వింజామరలు బూని | ||
| వేద వేదాంగముల్ విన్నవింప | ||
| తుంబురుడేనున్ తంబురల్ మీటుచు | ||
| సామ గానంబున సన్నుతింప | ||
| ప్రమథ గణంబులు ప్రమధాధిపతులును | ||
| జయ జయ ధ్వానముల్ జగతి నింప | ||
| పరమ శివుడంత పెండ్లికి తరలి రాగ! | ||
| నీదు వర పుత్రికను గంగ నిచ్చి.. | ||
| కన్యదాన మొనరింప తరియింప నగును సూవె | ||
| దక్ష హిమవంతులట్టులో ధన్య చరిత!. ఆ..ఆ.. |



