1952 సంవత్సరంలో విడుదలైన పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షంస్ సంస్థ నిర్మించిన పల్లెటూరు చిత్రం నుండి ఘంటసాలఎం.ఎస్.రామారావు,టి.జి.కమలాదేవి తో పాడిన "వచ్చిందోయి సంక్రాంతి" అనే ఈ బహుగళగీతం రచన సుంకర,వాసిరెడ్డి, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, టి.జి.కమలాదేవి, రమణారెడ్డి, మిక్కిలినేని, చదలవాడ, నాగభూషణం . ఈ చిత్రానికి నిర్మాత పి.శివరామయ్య మరియు దర్శకుడు తాతినేని ప్రకాశరావు. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 16.10.1952 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి