1956 సంవత్సరంలో విడుదలైన జూపిటర్ సంస్థ నిర్మించిన ఉమాసుందరి చిత్రం నుండి ఘంటసాల జిక్కీ తో పాడిన "ఎందుకోయి రేరాజ " అనే ఈ యుగళగీతం రచన సదాశివబ్రహ్మం, స్వరపరచినది అశ్వత్థామ. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, కన్నాంబ, శ్రీరంజని, రేలంగి, నాగయ్య, పేకేటి.. ఈ చిత్రానికి నిర్మాత ఎం.సోమసుందరం మరియు దర్శకుడు పి.పుల్లయ్య. దీనిని ఎన్.టి.ఆర్., జూ.శ్రీరంజని పై చిత్రీకరించారు. ఈ చిత్రం 20.07.1956 న విడుదలైంది.
కృతజ్ఞతలు: ఘంటసాల మాస్టారు పాడిన పాటల, పద్యాల, శ్లోకాల, వెరసి సమగ్ర రచనల సాహిత్యాన్ని అకుంఠిత దీక్షతో సేకరించి, "శతాబ్ది గాయకుడు ఘంటసాల" అను పుస్తకంలో ప్రచురించి, మాస్టారి అభిమానుల కోసం నా బ్లాగులో ఉపయోగించడానికి అనుమతించిన శ్రీయుతులు చల్లా సుబ్బారాయుడు గారికి శతకోటి ధన్యవాదాలు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి